ఢిల్లీ ఎయిర్పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)
ఢిల్లీ ఎయిర్పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా ఓ వ్యక్తి కుప్పకూలింది. వైద్య బృందానికి సమాచారం ఇచ్చాక.. ఆ వ్యక్తికి ఎయిర్పోర్టు సిబ్బంది సీపీఆర్ అందించారు. వైద్యుడు వచ్చేలోపు సీపీఆర్ అందించడం వల్ల.. ఆ ప్రయాణీకుడు ఊపిరి తీసుకున్నాడు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి ఒకరు సెప్టెంబర్ 1, 2025న ప్రీ-ఎస్హెచ్ఎ ప్రాంతంలో కుప్పకూలిన మహ్మద్ మొఖ్తార్ ఆలం అనే ప్రయాణికుడిని కాపాడారు. సబ్-ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ అక్కడికక్కడే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను త్వరగా అందించారు. వైద్య నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడిని కాపాడారు.
గయకు ప్రయాణించాల్సిన ఆలం అకస్మాత్తుగా కుప్పకూలి టెర్మినల్లోని ప్రీ-ఎస్హెచ్ఎ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ప్రదేశంలోనే ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి వీరేంద్ర సింగ్ వెంటనే పడిపోయిన ప్రయాణికుడికి సహాయం చేయడానికి పరుగెత్తారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.